
అమరావతి, 14 జూలై (హి.స.)
రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక(ఎంఈఆర్)పై సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఐదవ బ్లాక్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్వోడీలు సమావేశానికి హాజరుకానున్నారు. తొలుత సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ సీఎస్ ప్రసంగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ