

అమరావతి, 22 జూలై (హి.స.)
, జాతీయ నేర గణాంకాల(ఎన్సీఆర్బీ) ఆధారంగా ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కృష్ణా జిల్లాలో 2026 జనవరి నుంచి జూన్ వరకూ 32 పోక్సో కేసులు నమోదయ్యాయి. మే నెలలో అత్యధికం. చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలపై చాలా కుటుంబాలు కేసులు పెట్టడం అవమానంగా భావిస్తుండగా ఇటీవల పోలీసులు ప్రజల్ని చైతన్య పరచడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పాలి. ఈ కేసుల్లో చాలా వరకూ చిన్నారులకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు, తెలిసిన వారు నిందితులుగా ఉండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ