
హైదరాబాద్, 24 జూలై (హి.స.)దిల్లీలోని కన్నాట్ప్లేస్లో దుకాణాలు మూసివేయడం, భారీ భద్రతను ఏర్పాటు చేయడం, ఒక నిరసన చుట్టూ భయాందోళన వాతావరణాన్ని సృష్టించడం తప్పుడు సంకేతాన్ని పంపుతుందని భారాస శాసనసభపక్ష ఉపనేత హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ముళ్ల కంచెలు, ఆంక్షల వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం కాదు. చర్చల ద్వారానే అవుతుంది. విద్యార్థుల గొంతులను అణచివేయడం కాదు. వారి మాటలను వినాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్