ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు.. దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం
ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు.. దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం
Railway


ఆసిఫాబాద్, 24 జూలై (హి.స.)

రైల్వే స్టేషన్లో పరిశుభ్రతతో పాటు

భద్రత ప్రమాణాలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. శుక్రవారం సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషనన్ను సీనియర్ డీఓఈఎం మహేంద్ర వర్మ తో కలిసి ఆయన రైల్వేస్టేషన్ పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రయాణికుల వేచి ఉండే హాళ్లు, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ భద్రత, టికెట్ కౌంటర్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్లో పరిశుభ్రత. భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande