
హైదరాబాద్, 24 జూలై (హి.స.)
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లో అందుబాటులో ఉన్న కొన్ని నకిలీ ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడి) యాప్లను నమ్మి డౌన్లోడ్ చేసుకొని, కోట్ల రూపాయలు నష్టపోయామంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. గూగుల్ వంటి అధికారిక వేదికపై సదరు యాప్లు ఉండటం వల్లే తాము వాటిని నిజమైనవని నమ్మి మోసపోయామని బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మూడు వేర్వేరు ప్రధాన పెట్టుబడి మోసాల కేసులకు సంబంధించి దర్యాప్తులో భాగంగా 'హెడ్ ఆఫ్ గూగుల్ ఇన్ ఇండియా' (Google India Head)కు సైబర్ క్రైమ్ పోలీసులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు.ఇలాంటి నకిలీ మరియు మోసపూరిత యాప్లు ప్లే స్టోర్లోకి ఎలా ప్రవేశించాయి, వాటి నిర్వాహకుల వివరాలు మరియు సదరు యాప్ల ద్వారా జరిగిన లావాదేవీల డేటాను తక్షణమే సమర్పించాలని పోలీసులు గూగుల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసే యాప్లపై గూగుల్ తీసుకుంటున్న అంతర్గత చర్యల వివరాలను కూడా నివేదించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi