
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)
రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) నిర్మాణ పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అర్ధరాత్రి వరకు ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, నిధుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. అమరావతిని కనెక్ట్ చేసే ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi