
మహబూబాబాద్, 31 ఆగస్టు (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో మంత్రులు మొక్క నాటారు. ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో కేసముద్రం మండల పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు