బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటిసులు
ఢిల్లీ : ఫిబ్రవరి 3( హింస) బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాని
బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటిసులు


ఢిల్లీ : ఫిబ్రవరి 3( హింస) బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇష్యూ చేసింది. అంతేగాక, ఆ నోటీసులకు మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande