ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి.. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్
తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స) ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి పలు
ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి.. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్


తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స) ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి పలు రాష్ట్రాలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అయ రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నారని వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ అన్నారు.

శనివారం వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ సంక్షేమ సారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు అని అన్నారు.

ప్రతి ఒక్కరి అభివృద్ధి ద్వేయంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande