తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 12( హింస)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో కేసీఆర్కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేశారు వైద్యులు. అయితే జనరల్ చెకప్లో భాగంగానే ముఖ్యమంత్రి దంపతులు ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార