అమరావతి 26 ఏప్రిల్ (హిం.స)మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి() బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేతల వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుందాం. ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ . వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తాడేపల్లి(Thadepalli) పెద్దలకు పంపించారు డొక్కా. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డొక్కా.. అదును చూసి దెబ్బ వేశారు. ఎన్నికల ముంగిట పార్టీకి రిజైన్ చేశారు. డొక్కా రాజీనామాతో వైసీపీలో తీవ్ర అలజడి నెలకొంది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్