తాడిపత్రి:26 ఏప్రిల్ (హిం.స) అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. తాము కూడా వెళ్తామంటూ పోలీసులను నిలదీశారు. ఈ నేపథ్యంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఆర్వో కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్