కృష్ణా,26 ఏప్రిల్ (హిం.స): ఏపీలో ఎన్నికలు ) దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాల జోరును పెంచాయి. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అధికార పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు వైసీపీ) నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్గా కన్నా నాగరాజు భార్య జ్యోతి పనిచేస్తున్నారు. అయితే మచిలీపట్నంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో కన్నా నాగరాజు టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితమే దివంగత గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ సైకం అర్జునరావు కుటుంబం తెలుగుదేశంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కన్నా, సైకం కుటుంబాలు రెండూ తమ వర్గీయులతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో ఉండిపోయారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్