హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ రోజు ముంబై లోని వాడి బందర్ కోచింగ్ డిపోలో సమగ్ర తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక పురోగతి, భవిష్యత్తు ప్రణాళికల విస్తరణను ఆయన సమీక్షించారు. ప్రయాణీకుల భద్రత, పరిశుభ్రత మరియు సేవా విశ్వసనీయతను పెంపొందించడాన్ని ఆయన నొక్కి చెప్పారు.
తనిఖీలో ముఖ్యాంశాలు:
రైలు భద్రత మరియు నిర్వహణపై దృష్టి.
గౌరవ రైల్వే మంత్రి ఎల్హెచ్బి ( లింకే హాఫ్మన్ బుష్) కోచ్లకు టి పి యూ రింగ్ల జోడింపుతో స్ప్రింగ్ వైఫల్యాలను తగ్గించడానికి, రైడ్ సౌకర్యం మరియు భద్రతను పెంచడానికి మెరుగుదలను పరిశీలించారు. .
పరిశుభ్రత మరియు ప్రయాణీకుల సౌకర్యాలలో ఆవిష్కరణలు-
గౌరవ శ్రీ వైష్ణవ్ “ బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడిన ఇన్-హౌస్ డిజైన్ లిట్టర్ కలెక్టర్ వంటి ఆవిష్కరణల ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడానికి డిపో చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. విశ్రాంతి గదులు సహా ఉద్యోగుల సౌకర్యాల పరిశుభ్రతను కూడా ఆయన పరిశీలించారు
వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క 14-మినిట్ మిరాకిల్ క్లీనింగ్ ప్రక్రియలో ఉపయోగించిన డైసన్ వాక్యూమ్ క్లీనర్తో సహా అధునాతన శుభ్రపరిచే పరికరాల వినియోగాన్ని మంత్రి వ్యక్తిగతంగా పరిశీలించి , ప్రయాణీకుల సౌకర్యాల కల్పన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
భద్రత మరియు సమర్థత కోసం అధునాతన సాంకేతికతలు
తనిఖీలో ఎయిర్ బ్రేక్ సమగ్రతను నిర్ధారించడానికి అల్ట్రాసోనిక్ ఎయిర్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్లు మరియు సకాలంలో నిర్వహణ కోసం ఎఫ్ ఐ బి ఎ (ఫ్లషింగ్ ఇండికేటర్ మరియు బ్రేక్ అప్లికేషన్) సిస్టమ్ వంటి అధునాతన పరికరాలు ఉన్నాయని రాజధాని ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో ఈ సాంకేతికతలు ఇప్పటికే భద్రతను పెంచుతున్నాయని తెలిపారు .
అదనంగా, సిబ్బంది శిక్షణ కోసం వర్చువల్ రియాలిటీ వినియోగం మరియు ఆధారిత రియల్-టైమ్ వాటర్ లెవల్ మానిటరింగ్ సిస్టమ్ల ఏకీకరణ గురించి మంత్రికి వివరించబడింది. ఇది ప్రయాణీకులకు స్వచ్ఛమైన నీటిని నిరంతరాయంగా యాక్సెస్ చేయడానికి హామీ ఇస్తుంది.
నిర్వహణ మరియు శిక్షణపై దృష్టి:
వందే భారత్ రైళ్లకు అవసరమైన భాగాలను సకాలంలో మరమ్మతులు మరియు సేవా విశ్వసనీయతను నిర్ధారించడానికి అవసరమైన భాగాలు నిల్వ చేయబడిన వందే భారత్ స్టోర్ను మంత్రి సందర్శించారు . ఆయన ప్రాథమిక శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించారు, ఎల్.ఎచ్.బి. కోచ్ శిక్షణ కోసం అంతర్గత నమూనాలను పరిశీలించారు. ఎల్.ఎచ్.బి. కోచ్లు భద్రత మరియు సేవా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తుంది.
సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు ఆలస్యాన్ని తగ్గించడం, మొత్తం ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ప్రయోగాత్మక శిక్షణ కోసం వర్చుయల్ రియాలిటీ సాంకేతికతను ఉపయోగించడం ప్రశంసించబడింది.
ప్రయాణీకుల సేవలు మరియు ఫిర్యాదుల పరిష్కారం :
గౌరవ రైల్వే మంత్రి శ్రీ వైష్ణవ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్లో, ప్రయాణీకుల ఫిర్యాదులను నిర్వహించే బాధ్యత కలిగిన రైల్మదద్ బృందంతో సంభాషించారు. ప్రయాణీకుల సంతృప్తిని పెంపొందించడానికి దోహదపడటం, తక్షణం మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని అందించడంలో వారి ప్రయత్నాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అగ్నిమాపక పరికరాల భద్రత మరియు అత్యవసర సంసిద్ధత:
డిపోలో అగ్నిమాపక పరికరాల నిర్వహణకు, అన్ని అగ్నిమాపక భద్రతా పరికరాలను చక్కగా నిర్వహించడంతోపాటు అందుబాటులో ఉండేలా చూసేందుకు, ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తూ కొత్తగా రూపొందించిన యాప్ను కూడా మంత్రికి వివరించారు.
సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు మరింత సమర్థవంతమైన రైలు ప్రయాణాలను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను అవలంబించడంలో వాడి బండర్ డిపో యొక్క ప్రయత్నాలను ప్రశంసిస్తూ శ్రీ అశ్విని వైష్ణవ్ తనిఖీని ముగించారు. సందర్శన సమయంలో హైలైట్ చేయబడిన మెరుగుదలలు ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యాన్ని పెంపొందించడంలో భారతీయ రైల్వేయొక్క నిరంతర నిబద్ధతను ప్రదర్శిస్తాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు