మోదీ అరుదైన ఘనత
దిల్లీ: 11 జూలై (హి.స.)ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో బుధవారం చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభ
మోదీ అరుదైన ఘనత


దిల్లీ: 11 జూలై (హి.స.)ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో బుధవారం చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వాల తరఫున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు. దీనిపై భాజపా హర్షం వ్యక్తంచేసింది. వేరే దేశాలకు వెళ్లడం తప్పిస్తే దేశంలోని సమస్యలను పట్టించుకునే తీరిక మోదీకి ఎక్కడుందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, నమీబియా పార్లమెంట్లలో మోదీ ప్రసంగించడంతోపాటు పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో ఏడుసార్లు ప్రసంగించారు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు, నెహ్రూ మూడుసార్లు, రాజీవ్‌ గాంధీ రెండుసార్లు, పీవీ నరసింహారావు ఒకసారి ప్రసంగించారు. మోదీ అమెరికా పార్లమెంటులో రెండుసార్లు మాట్లాడారు. విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించడం ద్వారా మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయిలో గౌరవం దక్కుతోందని భాజపా ట్వీట్‌ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande