విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 28(హిం.స): విశాఖపట్టణం తూర్పు నియోజవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆ నియోజకవర్గ ఆర్.వో., జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తప్పులకు తావులేకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల చర్యలను చేపట్టాలని, అప్రమత్తంగా ఉండాలని ఏఆర్వోలను ఉద్దేశించి అన్నారు.
- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.