చెక్ పోస్టుల వద్ద తనిఖీలను పరిశీలించిన కలెక్టర్
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 28(హిం.స): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పోలీసులు
చెక్ పోస్టుల వద్ద తనిఖీలను పరిశీలించిన కలెక్టర్


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 28(హిం.స): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పోలీసులు జరుపుతున్న తనిఖీలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని ఆనందపురం, అడవివరం ప్రాంతాల వద్ద గల చెక్ పోస్టులను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న క్రమంలో రాష్ట్ర, జిల్లా సరిహద్దులతో పాటు పలు ముఖ్య ప్రాంతాల్లో విస్తృత తనిఖీలను ఎంసిసి బృందాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భీమిలి నియోజక వర్గంలోని ఆనందపురం, అడవివరం ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

తనిఖీలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 5 చెక్ పోస్టులలో గురువారం నుంచి స్టాటిక్ సర్వేలన్స్ టీములు తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande