శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 25(హిం.స): నరసన్నపేట గురువారం జనసంద్రంగా మారింది...మండుటెండలని సైతం లెక్కచేయకుండా అసంఖ్యాకంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ అభిమాననేత, వైసీపీ అభ్యర్ధి, జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ పర్వంలో పాల్గోడానికి జనయాత్రగా వెల్లువై ముందుకు సాగారు. గురువారం ఉదయం మబగాంలోని తన నివాసం నుంచి బయలుదేరిన కృష్ణదాస్ మార్గమధ్యంలో ముహూర్త సమయానికి నామినేషన్ పత్రాలపై సంతకాన్ని చేశారు. అనంతరం మాకివలస, దేవాది మీదుగా సత్యవరం జంక్షన్ కు చేరుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధి పేరాడ తిలక్, ధర్మాన రామదాస్, యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యలతో ప్రచార రథంపై సాగగా మిగిలిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఊరేగింపులో పాల్గొన్నారు.
- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.