చీరాల:25 ఏప్రిల్ (హిం.స) బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. చీరాల మండలం హస్తినాపురంలోని వినాయకస్వామి దేవాలయం నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సినీనటుడు నిఖిల్ సిద్దార్థ, తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. దీంతో చీరాల పట్టణం పసుపుమయమైంది. ఈ సందర్భంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్ మాట్లాడుతూ.. చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్