ఫోన్ ట్యాపింగ్ కేసు పై హైదరాబాద్ సిపి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 26: (హిం.స) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత
ఫోన్ ట్యాపింగ్ కేసు పై హైదరాబాద్ సిపి కీలక వ్యాఖ్యలు


హైదరాబాద్, ఏప్రిల్ 26: (హిం.స)

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమన్నారు. ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని.. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande