ఫోన్ టాపింగ్ కేసులో సంయమనం పాటించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఫోన్ టాపింగ్ హైకోర్టు..
ఫోన్ టాపింగ్ కేసు హైకోర్టు


Telangana Hyderabad, 10 జూలై (హి.స.)

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాలు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్టు కౌంటర్లో పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిపింది. ఈ వ్యవహారంపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది.

హిందూస్తాన్ సమచార్ / sampath Rao / నాగరాజ్ రావు


 rajesh pande