మదనపల్లిలో నాలుగవ రోజు పోలీసులు రెవెన్యూ అధికారుల విచారణ
అమరావతి, 25 జూలై (హి.స.) మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అటు పోలీసులు సమాంతరంగా నాలుగో రోజు కూడా విచారణ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
మదనపల్లిలో నాలుగవ రోజు పోలీసులు రెవెన్యూ అధికారుల విచారణ


అమరావతి, 25 జూలై (హి.స.)

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అటు పోలీసులు సమాంతరంగా నాలుగో రోజు కూడా విచారణ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సిసోడియా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో 3 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande