తాను ఎంపీడీవో నని పేదలకు ఇల్లు నిర్మిస్తున్నారని చేర్పిన.మోసగాడు అరెస్ట్
పెనుబల్లి : ., 27 జూలై (హి.స.)తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. అతడి మాటలను నమ్మిన ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఈ నెల
తాను ఎంపీడీవో నని పేదలకు ఇల్లు నిర్మిస్తున్నారని చేర్పిన.మోసగాడు అరెస్ట్


పెనుబల్లి : ., 27 జూలై (హి.స.)తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. అతడి మాటలను నమ్మిన ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఈ నెల 8న సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల ఎస్సీ కాలనీలో 20 ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాగమయి చేత శంకుస్థాపన చేయించాడు. అతనో మోసగాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో జనం విస్తుపోయారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండల కేంద్రానికి చెందిన అద్దంకి జనార్దన్‌రావు తాను మచిలీపట్నంలో ఎంపీడీఓగా చేస్తున్నానని చెప్పి పేద ప్రజలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయశాఖ నిపుణులు పాటిబండ్ల చంద్రశేఖర్‌రావు జ్ఞాపకార్థం నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పాడు

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande