బుడమేరు గండి. పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి
అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.) విజయవాడ: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి వరదను న
బుడమేరు గండి. పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి


అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి వరదను నిలిపివేస్తామన్నారు. సైన్యం సహాయంతో ఇక్కడ గండి పూడ్చివేత పనులు చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో దిగువకు వెళ్తున్న ప్రస్తుత ప్రవాహ పరిస్థితిని లోకేశ్‌కు నిమ్మల రామానాయుడు వివరించారు. మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. మూడు రోజుల్లో అందరికీ అందజేసే లక్ష్యంతో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande