జమ్మూ కాశ్మీర్లో బిజెపి అధికారంలోకి వస్తే టెర్రరిస్టులని తల ఎత్తుకోనివ్వం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
జమ్మూ కాశ్మీర్, 7 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన జమ్మూకశ్మీర్లో రాజకీయ ప్రచారాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. తాజాగా శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మెహబూబా ముఫ్తకి చెందిన పీపుల్స్ డెమోక్రటి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు


జమ్మూ కాశ్మీర్, 7 సెప్టెంబర్ (హి.స.) అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన జమ్మూకశ్మీర్లో రాజకీయ ప్రచారాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. తాజాగా శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తూ కీలక

వ్యాఖ్యలు చేశారు. మెహబూబా ముఫ్తకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి ఎన్సీ-కాంగ్రెస్ కూటమి.. జమ్మూకశ్మీర్ వేర్పాటు వాదులు,ఉగ్రవాద సానుభూతి పరులను విడుదల చేయాలని

కోరుతూ ఈ ప్రాంతాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జమ్మూలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన షా, ఈ మూడు కుటుంబాలు జమ్మూకశ్మీర్ని దోచుకున్నాయి. వారు అధికారంలోకి వస్తే ఉగ్రవాదం తిరిగి వస్తుంది. జమ్మూ ప్రజలు వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలి, బీజేపీ అధికారంలోకి వస్తే, టెర్రరిస్టులను తల ఎత్తనివ్వమని అన్నారు. కూటమి జమ్మూ హక్కులను హరించడం, ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తిని తిరిగి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి, ఇది ఎప్పటికీ జరగదని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడటానికి ఏ శక్తి ధైర్యం చేయదని షా చెప్పారు.

అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారు. అలా చేసే అధికారం ఆయనకు ఉందా?.. నేను ఇప్పటికే పార్లమెంట్లో చెప్పాను.. ఎన్నికల తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని, కనుక ఇక నుండైనా రాహుల్ ప్రజలను మోసం చేయడం, తప్పుదోవ పట్టించడం ఆపాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande