తుంగభద్ర.జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది
అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.) హాలహర్వి : పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జల ప్రదాయిని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 34,421 క
తుంగభద్ర.జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది


అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)

హాలహర్వి : పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జల ప్రదాయిని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 34,421 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 1632 అడుగులకు గాను 101.77 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. జలాశయం నుంచి వివిధ కాల్వలకు, 13 గేట్లు ఎత్తి నదికి కలిపి 34,181 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande