బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో  తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు.. దోషి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష..
తిరువ‌నంత‌పురం, 20 జనవరి (హి.స.) బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష ఖరారు చేసింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించ
తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు


తిరువ‌నంత‌పురం, 20 జనవరి (హి.స.)

బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష ఖరారు చేసింది.

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ఈ ఘటన చోటుచేసుకోగా.. గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది.

కన్యాకుమారి జిల్లా రామవర్మంచిరకు చెందిన గ్రీష్మ, షరోన్ రాజ్ లు ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలో వారిద్దరూ శరీరికంగా దగ్గరయ్యారు.. ఆ ఫోటోల‌తో షరోన్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంబించాడు.. అత‌డి వేదింపులు త‌ట్టుకోలేక గ్రీష్మ ఒకరోజు త‌న ఇంటికి పిలిచి ప్రాణాంతకమైన కలుపు సంహారక మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చింది. దీంతో అత‌డ అప‌స్మార‌క స్థితికి చేరుకున్నాడు.. అ త‌ర్వాత అత‌డు చికిత్స పొందుతూ 11 రోజుల త‌ర్వాత హాస్ప‌ట‌ల్ లో మ‌ర‌ణించాడు.

దీనిపై ష‌రోన్ పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు.. ఈ హ‌త్య‌కు స‌హ‌క‌రించిన బందువుని సైతం అరెస్ట్ చేశారు.. ఈ కేసును విచారించిన తిరువ‌నంత‌పురం కోర్టు న్యాయ‌మూర్తి ఏఎం బషీర్ ఇది అరుదైన నేరంగా నిర్ధారించారు. నిందితురాలు ఆమె చిన్న వయస్సు , విద్యార్హత కారణంగా ఎటువంటి ఉపశమనానికి అర్హులు కాదని తీర్పు ఇచ్చారు. మహిళ చర్య సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపింద‌ని పేర్కొన్నారు.. ఇక ఆమెకు ఉరిశిక్ష ను ఖరారు చేశారు.. ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande