అనంతపురం, 1 అక్టోబర్ (హి.స.):డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ముందే కౌన్సెలింగ్ నిర్వహించి, ప్లేస్మెంట్స్ ఇచ్చి 4 నుంచి 13 వరకు శిక్షణ ఉంటుందని మళ్లీ చర్చ సాగింది. దీనిపై కమిషనర్ విజయరామరాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ