అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈ (UAE)లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో ముఖ్యమంత్రి బృందం పర్యటన చేపట్టనుంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు దుబాయ్ వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ