‌ మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన. చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, 24 అక్టోబర్ (హి.స.) ,మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. చంపావతి నదిపై వంతెన లేక ఇబ్బంది పడుతున్న విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామస్థుల సమస్యలపై ‘స్పందించిన మంత్ర
‌ మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన. చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్


విజయనగరం, 24 అక్టోబర్ (హి.స.)

,మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. చంపావతి నదిపై వంతెన లేక ఇబ్బంది పడుతున్న విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామస్థుల సమస్యలపై ‘స్పందించిన మంత్రి కొండపల్లి ఈ నెల ఒకటిన జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మర్రివలస సమస్యను తీసుకెళ్లామని ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం స్పందించి మర్రివలస గ్రామానికి మినీ వంతెనకు నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande