
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)భారతీయులకు బంగారం అంటేనే స్పెషల్ సెంటిమెంట్. వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అయితే బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ సామాన్యులను, ముఖ్యంగా మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పసిడి ధరల భగభగతో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఏడాది కిందట సుమారు రూ. 70,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం ఏకంగా రూ. 1,30,000 మార్కును దాటింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో బంగారం ధర 60శాతం పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అభద్రత కారణంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,360గా ఉంది. నిన్న ఇది రూ.1,24,370గా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి స్వల్పంగా అంటే రూ.10రూపాయలు తగ్గింది.
ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,24,360గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,13,990 ఉండగా.. నిన్న రూ.1,14,000గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం స్వల్పంగా రూ.10రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.93,270గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,24,360గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,990గా ఉండగా.. నిన్న 1,14,000గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,24,360 ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉండేది. అంటే రూ.10 పెరిగింది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,360గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,990గా ఉంది.
వెండి ధరలు
ఇక వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్లో తులం వెండి రూ.1699గా ఉంది. ఇక కిలో వెండి రూ.1,69,900గా ఉంది. ఇది నిన్నటికి ఇవాళ్టికి రూ.100 తగ్గింది. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1699గా ఉండగా.. కిలో వెండి రూ.1,69,900గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV