
భద్రాద్రి కొత్తగూడెం, 2 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల, ఆళ్లపల్లి, మర్కోడు మధ్యలో
సుమారు 10 కిలోమీటర్లు రహదారి గుట్టలు, రాళ్లు, గుంతలతో ఉంటుంది. ఆదివారం పినపాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా ఆ రహదారి వెంట ప్రయాణించి ఆశ్చర్యం కలిగించారు. ఆ రహదారి వెంట ప్రయాణించేవారు ఇటువైపు కార్లు వెళ్లలేని దుస్థితి ఉందని చెప్పినా, ఈ రహదారిని పరిశీలించాలని వచ్చానని వారితో చెప్పినట్లుగా తెలిపారు. మండల వాసులు ఈ రహదారిపై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి నిర్మిస్తే మేడారం, మణుగూరు, భద్రాచలం, ఛత్తీస్ గఢ్, వరంగల్, ములుగు ప్రయాణాలు సులువుగా కొనసాగుతాయని ప్రయాణికులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు