ఏపీలో పది తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ను ఎస్ ఎస్ సీ బోర్డ్ విడుదల చేసింది
అమరావతి, 21 నవంబర్ (హి.స.) ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇం
ఏపీలో పది తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ను ఎస్ ఎస్ సీ బోర్డ్ విడుదల చేసింది


అమరావతి, 21 నవంబర్ (హి.స.)

ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్‌, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande