జమ్ములో పాకిస్థాన్ ఉగ్రవాదులు.. అప్రమత్తమైన భద్రతాబలగాలు..!
జమ్మూ, 28 డిసెంబర్ (హి.స.) జమ్మూ ఏరియాలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అ
పాకిస్థాన్ ఉగ్రవాదులు..


జమ్మూ, 28 డిసెంబర్ (హి.స.) జమ్మూ ఏరియాలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande