
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ
సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒక సీనియర్ నేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ను కొంత అసౌకర్యానికి గురి చేసినప్పటికీ, పార్టీలోని అనుభవజ్ఞులలో పెరుగుతున్న అసంతృప్తిని కూడా బయటపెట్టింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..