తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.)
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల
మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనలు చేపట్టడంతో, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు నల్లవల్లిలో 144 సెక్షన్ను పోలీసులు అమలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారులకు మధ్య తీవ్రవాగ్వాదం కొనసాగింది. దీంతో ఆందోళన దారులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషనులకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్