విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
విశాఖపట్నం, 13 మార్చి (హి.స.) విశాఖపట్నం జిల్లాలోని కూర్మన్నపాలెం జాతీయ రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ టిప్పర్ వాహనా
రోడ్డు ప్రమాదం


విశాఖపట్నం, 13 మార్చి (హి.స.)

విశాఖపట్నం జిల్లాలోని కూర్మన్నపాలెం జాతీయ రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ టిప్పర్ వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారని అదే సమయంలో వెనకనుంచి వస్తున్న ఆర్టిసి బస్సు వాళ్ల తలపై నుంచి వెళ్లడం వల్ల ఘటనా స్థలంలోనే వారిద్దరూ కూడా చనిపోయారని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృత దేహాలని కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దువ్వాడ పోలీసులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande