తెలంగాణ, 14 మార్చి (హి.స.)
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు, నిజామాబాద్లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్