తాను బిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ ఫ
పటాన్చెరు ఎమ్మెల్యే


హైదరాబాద్, 20 మార్చి (హి.స.)

తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వం కింద ప్రతీ సంవత్సరం రూ.5వేలు చెల్లిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించానంటూ వక్రీకరించారని చెప్పారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్గాద్వారా తెలియజేశానన్నారు.సీఎం సమక్షంలో మహిపాల్రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నాయకత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరికపై యూ టర్న్ తీసుకున్న మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande