హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)
మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం
ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ఇవాళ సీఎం రేవంత్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,
పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు.
స్టాచ్యూ స్థలం కోసం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ రూపకల్పన చేయాలని చేయాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్