తిరుమల, 19 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ సినీ నటి సమంత నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న 'శుభం' చిత్ర బృందంతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత, 'శుభం' యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వీరికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమంత, చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి