పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.)మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా‌కు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.


హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.)మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా‌కు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణం‌లో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande