సోంపేట, 20 ఏప్రిల్ (హి.స, సోంపేట మండలం బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం సందడిగా సాగింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారువ తీరం జన సంద్రంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ము ఖ్య అతిథిగా హాజరై బీచ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. శనివారం ఉదయం 5.30 గంటలకే కేంద్రమంత్రితోపాటు విప్ బెందాళం అశోక్ బీచ్కు చేరు కుని.. పర్యాటకులతో ముచ్చటించారు.
సముద్రంలో ఆలివ్రిడ్లే తాబేళ్ల పిల్లలను విడిచిపెట్టారు. కబడ్డీ, వాలీబాల్, పడవ పోటీలను నిర్వహించారు. బోటు షికారులో విహ రించారు. గాలిపటాలు ఎగరేశారు. సముద్రంలో అపాయం ఎదురైతే.. ఎలా రక్షించాలో డెమో ద్వారా పర్యాటకులకు నేవీ అధికారులు వివరించా రు. మరోవైపు సాంస్కృతిక నృత్యప్రద ర్శనలతో బీచ్లో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. బారువ ఎంపీపీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఆలివ్రిడ్లే తాబేలు సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుం
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు