విజయవాడ, 9 మే (హి.స.)
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. 24 గంటల పాటు డేగ కళ్లతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్, అమృత్సర్, జోధ్పుర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల