పూసపాటిరేగ, 20 ఏప్రిల్ (హి.స.), అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో.. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబరు 13న నెల్లిమర్ల, అనకాపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో శనివారం ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ఆయా పోలీసుస్టేషన్లలో ఆమెను పోలీసులు విచారించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు