న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.)
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వినాయక్ దామోదర్ సావార్కర్పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్పై రాహుల్ ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావార్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. ఒకవేళ రాహుల్ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆయనపై సుమోటో కేసును నమోద చేసి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు చెప్పింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..