హైదరాబాద్, 5 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్ లోని ఇందిరా చౌక్ వద్ద శనివారం ఒక ప్రత్యేకమైన ఆందోళన జరిగింది. పురుషులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి “SHE టీమ్స్” తరహాలో “HE టీమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు, పలువురు సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మగవారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మహిళల రక్షణ కోసం “SHE టీమ్స్” విజయవంతంగా పనిచేస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో పురుషులు కూడా అనేక అన్యాయాలకు గురవుతున్నారని, వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక టీమ్ అవసరమని ఆందోళనకారులు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్