విజయవాడ, 8 మే (హి.స.)
ఇంటర్మీడియట్ విద్యలో నూతన సంస్కరణలను కూటమి ప్రభుత్వ తీసుకొచ్చింది. జూనియర్ కళాశాలల్లో సీబీఎస్ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంబైపీసీ కోర్సును అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు అధ్యాపకులకు శిక్షణ సైతం ఇచ్చారు. మిగిలిన గ్రూపుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం పరీక్షల విధానం, మార్కుల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల