అమరావతి, 2 జూన్ (హి.స.)
: తిరువూరు () నగర పంచాయతీ ఛైర్పర్సన్)గా కొలికపోగు నిర్మల ( ఎన్నికయ్యారు. ఆమెకు ఎక్స్ అఫిషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు తెలపడంతో ఆయన ఓటు సహా మొత్తం 11 ఓట్లు లభించాయి. వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. గత నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తిరువూరు నగర పంచాయతీ తెలుగుదేశం (TDP) కైవసం చేసుకుంది. గత నెల 19, 20 తేదీల్లో జరిగిన నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. కాగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి మోదుగు ప్రసాద్కు 9 ఓట్లు వచ్చాయి. దీంతో చైర్మన్గా టీడీపీ అభ్యర్తి కొలికపోగు నిర్మల ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డివో మాధురి, అబ్సర్వర్ లక్ష్మీ నరసింహం ప్రటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ