న్యూఢిల్లీ, 2 జూన్ (హి.స.)
:పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట)పై కేంద్రం ముందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (ప్రతిపాదనలు l) సిద్ధం చేసింది. పోలవరం ( నుంచి బనకచర్ల )కు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్ల (Rs 81,000 crore)తో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై రాష్ట్ర ఆర్ధిక, నీటిపారుదల శాఖల అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ ), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ )కు ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ